కేరళ బాలిక అదృశ్యం.. భారీ గాలింపు కొనసాగుతోంది
Kerala girl missing : కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ట్రెక్కింగ్కు వెళ్లిన వారి అదృశ్య ఘటనలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా కేరళ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల బాలిక అదృశ్యం కావడం కలకలం రేపింది. పాలక్కాడ్ జిల్లాకు చెందిన శ్రీనంద అనే పదో తరగతి విద్యార్థిని ఏప్రిల్ 7న తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కొండ ప్రాంతానికి హైకింగ్కు వెళ్లింది.
సాయంత్రం 5:30 గంటల సమయంలో చీకటి పడుతున్న వేళ ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ గాలింపు చర్యలు
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అడవులు, లోయలు, ఘాట్ రోడ్ల వద్ద విస్తృతంగా గాలింపు చేపట్టారు. డ్రోన్ కెమెరాలు, తాళ్ల సహాయంతో క్లిష్టమైన ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. కర్ణాటకతో పాటు కేరళ పోలీసులు కూడా ఈ గాలింపులో పాల్గొంటున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు బాలిక ఆచూకీ లభించలేదు.
ముందే జరిగిన మరో ఘటన
కొద్ది రోజుల క్రితం కేరళకు చెందిన శరణ్య అనే ఐటీ ఉద్యోగిని కూడా కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న తడియండమోల్ కొండ ప్రాంతంలో తప్పిపోయింది. ఆమె తన బృందం నుంచి విడిపోయి అడవిలో నాలుగు రోజుల పాటు చిక్కుకుపోయింది. ఆహారం లేకుండా కేవలం నీళ్లు తాగుతూ గడిపిన ఆమెను చివరకు రెస్క్యూ బృందం కాపాడింది.
Read Also:Ibrahimpatnam: చైర్మన్ సుదర్శన్రెడ్డికి ఘన సన్మానం
Kerala girl missingకొత్త నిబంధనలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ట్రెక్కర్ల భద్రత కోసం ప్రత్యేక ట్రాకింగ్ యాప్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ట్రెక్కర్ల లొకేషన్ను గుర్తించే విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. అదే విధంగా ట్రెక్కింగ్ గైడ్లకు వైర్లెస్ సెట్లు ఇవ్వడం, గ్రూప్ లీడర్లకు మరింత బాధ్యత ఇవ్వడం, ట్రెక్కర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం వంటి కొత్త నియమాలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
డీపీవోల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ ప్రవీణ్యకు వినతి పత్రం అందజేసిన అసోసియేషన్

