Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందన్న అశ్వినీ వైష్ణవ్

త్వరలో కాజీపేటలో ఇంటర్ సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందన్న అశ్వినీ వైష్ణవ్

వార్త 2 weeks ago

Ashwini Vaishnaw: తెలంగాణలోని చారిత్రాత్మక రైల్వే జంక్షన్ కాజీపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే తయారీ యూనిట్ (Rolling Stock Manufacturing Unit) పనులు తుది దశకు చేరుకున్నాయి.

త్వరలోనే ఈ అత్యాధునిక కర్మాగారంలో సరికొత్త ‘ఇంటర్ సిటీ’ రైళ్ల ఉత్పత్తి ప్రారంభం కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విినీ వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ఫ్యాక్టరీ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.

 Kazipet Rail Manufacturing Unit

Read also: TG paddy procurement: వర్షం వస్తుందని తెలిసినా.. ధాన్యం సేకరణలో విఫలమైన ప్రభుత్వం

ఐదేళ్లలో 200 అత్యాధునిక ఇంటర్ సిటీ రైళ్లు!

కాజీపేట రైల్వే యూనిట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రానున్న ఐదేళ్ల కాలంలో దేశీయ అవసరాల కోసం ఏకంగా 200 ఇంటర్ సిటీ రైళ్లను ఇక్కడే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా స్వల్ప దూర ప్రయాణాలకు, పట్టణాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ రైళ్లను ప్రత్యేకంగా కేటాయించనున్నారు. నిత్యం వివిధ పనుల కోసం పొరుగు పట్టణాలకు వెళ్లే ఉద్యోగులు, ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, వ్యాపారస్తులకు ఈ సర్వీసులు ఎంతో సురక్షితమైన, సరసమైన ప్రయాణ ప్రత్యామ్నాయంగా మారనున్నాయి. దీనివల్ల రోడ్డు రవాణాపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది.

Ashwini Vaishnaw: గంటకు 130 కి.మీ వేగం.. అంతర్జాతీయ స్థాయి ఫీచర్లు

కాజీపేటలో తయారయ్యే ఈ సరికొత్త ఇంటర్ సిటీ రైళ్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని రైల్వే మంత్రి వివరించారు. ఈ రైళ్ల ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. ప్రతి ఇంటర్ సిటీ రైలులోనూ సురక్షితమైన డిజైన్‌తో కూడిన 20 కోచ్‌లు (భోగీలు) ఉంటాయి. మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ సిస్టమ్, అత్యుత్తమ వెంటిలేషన్ (గాలి వెలుతురు) సౌకర్యం ఈ రైళ్ల సొంతం. అలాగే ప్రయాణం కుదుపులు లేకుండా ఉండేందుకు ‘జెర్క్-ఫ్రీ కప్లర్స్’ను అమరుస్తున్నారు.

గ్రిడ్‌కు విద్యుత్‌ను అందించే ‘రీజనరేటివ్ బ్రేకింగ్’ టెక్నాలజీ

పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఆదా ధ్యేయంగా ఈ రైళ్లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన “రీజనరేటివ్ బ్రేకింగ్” (Regenerative Braking) సాంకేతికతను వాడుతున్నారు. ఈ విధానం ద్వారా రైలుకు బ్రేకులు వేసిన ప్రతిసారీ అది ఒక విద్యుత్ జనరేటర్‌లా మారుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha