Dailyhunt
ఉద్యోగం రాలేదని బీటెక్ యువతి ఆత్మహత్య!

ఉద్యోగం రాలేదని బీటెక్ యువతి ఆత్మహత్య!

వార్త 1 week ago

Kadapa Crime: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగం ఒక యువ ప్రాణాన్ని బలిగొన్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో బీటెక్ చదివిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది..

Read Also:UP Crime: కేక్ పూసినందుకే ముగ్గురిని చంపిన కిరాతకుడు.. పోలీసుల కాల్పుల్లోనిందితుడు మృతి

ఘటన వివరాలు

వైఎస్ఆర్ జిల్లా, మైలవరం మండలం, దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన, చిన్య లావణ్య (28) ఈమె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది..నిన్న మధ్యాహ్నం రోడ్డు పక్కన తనపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె ప్రాణాలు కోల్పోయింది.

 YSR District Youth Suicide

Kadapa Crime: ఆత్మహత్యకు గల కారణాలు

లావణ్య బీటెక్ పూర్తి చేసిన తర్వాత రైల్వే, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరంతరం ప్రయత్నిస్తోంది.అనేక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.నిరుద్యోగ సమస్య, భవిష్యత్తుపై ఆందోళనతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha