Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు.. జగిత్యాల వాసి మృతి

ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు.. జగిత్యాల వాసి మృతి

వార్త 2 weeks ago

Ukraine-Russia War: ఉక్రెయిన్ దేశంపై రష్యా సైన్యం జరిపిన భీకర క్షిపణి దాడుల్లో ఒక తెలంగాణ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ అనే వ్యక్తి ఈ దాడుల్లో దుర్మరణం చెందడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తి ఇలా యుద్ధానికి బలవడం స్థానికంగా కలకలం రేపింది.

ఉపాధి కోసం ఉక్రెయిన్ వెళ్లిన సుదర్శన్ గౌడ్ – దాడుల వివరాలు

జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) గతంలో స్వగ్రామంలోనే షట్టరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో సుమారు నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వలస వెళ్లాడు. కాగా, రష్యా సైన్యం కీవ్‌తో పాటు పలు ప్రధాన నగరాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో భారీ స్థాయిలో దాడులకు తెగబడింది. ఆ సమయంలో సుదర్శన్ తాను ఉంటున్న గది వెలుపలికి రాగా, దురదృష్టవశాత్తు క్షిపణి దాడికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

Ukraine-Russia War: కుటుంబానికి చేరిన మరణ వార్త – శోకసంద్రంలో బంధువులు

ఈ భీకర దాడుల్లో సుదర్శన్‌తో పాటు మరో 11 మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఉక్రెయిన్‌లోనే ఉంటున్న సమీప తాటిపల్లి గ్రామానికి చెందిన వేణు అనే వ్యక్తి ద్వారా సుదర్శన్ మరణించిన వార్త ఆయన కుటుంబ సభ్యులకు చేరింది. పొట్టకూటి కోసం వెళ్లిన తమ ఇంటి పెద్ద విదేశీ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడంతో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వాలు తగిన సహాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.

కవిత వ్యాఖ్యలపై ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్పందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha