Dailyhunt
UP Bus Accident: బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

UP Bus Accident: బస్సును ఢీకొట్టిన కంటైనర్.. ఆరుగురు మృతి

వార్త 2 months ago

UP Bus Accident: ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. సురీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ( Yamuna Expressway) అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్కు సృష్టించిన బీభత్సానికి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Read Also:HYD: పేరుకు వంట మనిషి వజ్రాల కె ఎసరు పెట్టిన మోసగాడు

అసలేం జరిగింది?

రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక ప్రైవేట్ బస్సును, అలాగే బస్సు దిగి అక్కడ నిలబడి ఉన్న ప్రయాణికులను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ అత్యంత వేగంతో ఢీకొట్టింది. ఈ ధాటికి ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు మరియు SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. తెల్లవారుజామున మంచు కారణంగా లేదా డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

HYD: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha