Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి కోసం వెళ్తే. విక్రయించాడు: తల్లిదండ్రులు

ఉపాధి కోసం వెళ్తే. విక్రయించాడు: తల్లిదండ్రులు

వార్త 3 days ago

Chandragiri Crime: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఒక కలకలం రేపే ఉదంతం వెలుగులోకి వచ్చింది. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ఒక నిరుపేద యువతిని ఏజెంట్ మోసగించి, అక్కడ ఒక షేక్‌కు విక్రయించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

కన్నకూతురిని ఎలాగైనా రక్షించి భారతదేశానికి తిరిగి తీసుకురావాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నమ్మించి మోసం చేసిన పీలేరు ఏజెంట్

పోలీసుల కథనం ప్రకారం.. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని గోపాలపల్లెకు చెందిన చెంగయ్య కుమార్తె భాగ్యవతి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పీలేరుకు చెందిన ఏజెంట్ చిన్నబ్బను ఆమె సంప్రదించింది. కువైట్‌లో ఒక పెద్ద షేక్ ఇంట్లో మంచి జీతంతో కూడిన పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తానని చిన్నబ్బ ఆమెకు నమ్మబలికాడు. అవసరమైన అన్ని వెరిఫికేషన్లు పూర్తి చేసుకుని భాగ్యవతి ఆరు నెలల క్రితం కువైట్ చేరుకుంది.

6 మాసాలుగా నరకయాతన.. వీడియో ద్వారా వేడుకోలు

కువైట్ వెళ్లిన భాగ్యవతిని ఒప్పందం ప్రకారం కాకుండా వేర్వేరు కఠినమైన పనులు చేయిస్తూ అక్కడి షేట్లు తీవ్రంగా వేధించడం ప్రారంభించారు. గత ఆరు నెలలుగా ఆమెను ఒకరి నుండి మరొకరికి ఇళ్లు మారుస్తూ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు బాధితురాలు కన్నీళ్లతో ఒక వీడియోను రూపొందించి తన తల్లిదండ్రులకు పంపింది.

ఈ వీడియో ద్వారా ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మరియు స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిలకు తన ఆవేదనను తెలియజేసింది. తనను ఎలాగైనా ఆ నరకం నుండి విడిపించి ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమై వేడుకుంది.

Chandragiri Crime: రంగంలోకి పోలీసులు.. నిందితుడి కోసం ముమ్మర గాలింపు

బాధిత మహిళ తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందుకున్న చంద్రగిరి ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏజెంట్ చిన్నబ్బపై సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దించినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి, ఉన్నతాధికారులు మరియు గల్ఫ్ ఎంబసీ అధికారుల సహాయంతో భాగ్యవతిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha