Telangana weather:తెలంగాణలో వానల్లేక రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం స్తంభించిపోగా, మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది.
ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నా, వాన చినుకు మాత్రం పడటం లేదు. దీంతో సాగు పనులు ఆగిపోయి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Farmers’ agitation due to lack of rain in Telangana
విత్తనాలు మొలకెత్తక రైతుల్లో కంగారు
పొలాల్లో ఇప్పటికే నాట్లు వేసిన రైతులు వానలు లేక ఆందోళనలో ఉన్నారు. భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తడం లేదు, మొలకెత్తిన పంటలు కూడా నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. పెట్టుబడి పెట్టిన సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని అన్నదాతలు భయపడుతున్నారు. వర్షాధార పంటలు వేసిన వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
Telangana weather:వర్షాలు కురిసే అవకాశం లేదని
రానున్న వారం పది రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి, రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com

