Dailyhunt
వచ్చే మూడు వారాల్లో ఇరాన్‌పై తీవ్రమైన దాడులు..

వచ్చే మూడు వారాల్లో ఇరాన్‌పై తీవ్రమైన దాడులు..

వార్త 2 weeks ago

చ్చే 2-3 వారాల పాటు ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో దాడులు ఉంటాయని, ముఖ్యంగా ఇరాన్ పవర్ ప్లాంట్లు తమ తదుపరి లక్ష్యాలని ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామీహెచ్చరించారు.

డెత్ టు అమెరికా అంటూ చాలా ఏళ్లుగా నినదిస్తున్న ఇరాన్‌ను అంతం చేయకపోతే.. అమెరికా దేశానికి భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. కేవలం తమ దేశానికి కాకుండా ప్రపంచ భద్రతకు కూడా ఇరాన్ నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అందుకే ముందస్తుగా దాడులు చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ ధైర్యం చేసి హార్మూజ్ జలసంధి బాధ్యతలను తీసుకోవాలని ట్రంప్ కోరారు.

Read Also: India vs Pakistan: భారత్‌ పై పాక్ సైన్యంతో దాడులు చేస్తాం ..ఖవాజా ఆసిఫ్

 Iran-America War

Iran-America War: ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలతో మిగలకూడదు

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపు తుడిచి పెట్టేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. ఇరాన్ అత్యంత భయంకరమైన హెచ్చరిక జారీ చేసింది. ఒకవేళ అమెరికా గనుక భూతల దాడులకు దిగితే.. ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలతో మిగలకూడదని ఇరాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామీ తన దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్ వెన్నెముక విరిచేశామని ప్రకటించారు. ఇరాన్ నౌకాదళం అంతమైందని, వైమానిక దళం శిథిలావస్థకు చేరిందని.. వారి కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని పేర్కొన్నారు. ”

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి..రెండు విమానాలు ధ్వంసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha