Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వధువు అనుమానాస్పద మృతి: బలవంతపు గర్భస్రావంపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

వధువు అనుమానాస్పద మృతి: బలవంతపు గర్భస్రావంపై కుటుంబ సభ్యుల ఆరోపణలు

వార్త 1 week ago

త్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ (33) వివాహమైన కేవలం ఐదు నెలలకే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో ఐదు నెలల క్రితమే ఆమెకు వివాహమైంది.

అయితే, మే 12 మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా మరణించడంతో, అత్తమామల వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ట్విషా మరణించడానికి కొద్ది నిమిషాల ముందు జరిగిన సంఘటనలను ఆమె సోదరుడు, భారత సైన్యంలో మేజర్ అయిన హర్షిత్ శర్మ వివరించారు. ట్విషా తన తల్లికి ఫోన్ చేసి అత్తగారి ఇంట్లో పడుతున్న కష్టాలు, వేధింపుల గురించి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఆమె భర్త గదిలోకి రావడంతో ఫోన్ కట్ అయిపోయింది. ట్విషా కుటుంబ సభ్యులు పదే పదే ప్రయత్నించగా, చివరకు ఆమె అత్త గిరిబాల సింగ్ ఫోన్ ఎత్తి, ట్విషాకు శ్వాస ఆడటం లేదని సమాచారం ఇచ్చారు. ఇల్లు ఆసుపత్రికి కేవలం 10 నిమిషాల దూరంలోనే ఉన్నప్పటికీ, వారు రాత్రి 11:30 గంటల ప్రాంతంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లారని, అప్పటికే ట్విషా మరణించిందని వైద్యులు ప్రకటించారు. ఈ జాప్యం వెనుక కుట్ర ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Read Also: Chilipally Theft: దొంగల బీభత్సం: 100 తులాల బంగారం, కిలో వెండి అపహరణ!

 Bride’s Suspicious Death

Bride’s Suspicious Death: బలవంతపు గర్భస్రావం, వరకట్న వేధింపులు

ట్విషా అత్తమామల ఇంట్లో తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులను ఎదుర్కొందని ఆమె సోదరుడు ఆరోపించారు. గర్భస్రావానికి ఒత్తిడి.. ట్విషా గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డను కనాలని ఆశపడింది. కానీ, ఆమె భర్త, అత్తమామలు ఆమె నడవడికను అనుమానిస్తూ, ఆ బిడ్డ తనది కాదంటూ వేధించారు. చివరికి నిరంతర మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆమె వైద్యపరంగా గర్భస్రావం చేయించుకోవాల్సి వచ్చింది. పెళ్లి సమయంలో ట్విషా తండ్రి బహుమతిగా ఇచ్చిన రూ. 20 లక్షల విలువైన షేర్లు,పెట్టుబడులను భర్త, అత్తగారి పేరు మీదకు బదిలీ చేయాలంటూ ఆమెను తీవ్రంగా వేధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha