Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు

వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు

వార్త 2 weeks ago

Achchennaidu: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో ప్రతికూల రాజకీయాలకు జగన్ ప్రతీకగా మారారని విమర్శించారు.

వెన్నుపోటు రాజకీయాలపై విమర్శలు

వెన్నుపోటు అనే పదాన్ని రాజకీయాల్లో ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి జగన్ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. అధికార ప్రయోజనాల కోసం రాజకీయ మిత్రులతో పాటు సన్నిహితులను కూడా వదిలిపెట్టని చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ ప్రచారం జరుగుతోందన్నారు. ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సవాల్‌ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని జగన్‌ను కోరారు.

Read also: Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్

Achchennaidu: రొయ్యల మేత ధరలపై చర్చకు సిద్ధం

రొయ్యల మేత ధరలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతగా పెరిగాయో ఆధారాలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యాపార సంస్థలను కులాలతో అనుసంధానం చేయడం సరైన రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. గతంలో వైసీపీ చేసిన ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కొన్ని లోపాలు జరిగాయని అంగీకరించిన మంత్రి, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదన్నారు. జగన్ చేసే ప్రతి ఆరోపణను వాస్తవాలు, గణాంకాలతో ఖండిస్తామని స్పష్టం చేశారు.

హోం మంత్రి అనితపై వ్యాఖ్యలపై ఆగ్రహం

హోం మంత్రి వంగలపూడి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం వైసీపీ రాజకీయ వైఫల్యానికి నిదర్శనమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరమన్నారు. మద్య నిషేధం సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అలాంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలపై ప్రశ్నించే నైతిక హక్కు వైసీపీకి లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

"అనిత గొంతు నొక్కలేరు": వైసీపీకి లోకేశ్ షాకింగ్ వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha