Paddy In Telangana : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానకాలం (ఖరీఫ్) సీజన్లో వర్షాభావ పరిస్థితుల అంచనాలను తలకిందులు చేస్తూ వరి సాగు క్రమంగా పుంజుకుంటోంది.
జూన్, జులై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ప్రారంభంలో కరవు ఛాయలు అలముకున్నప్పటికీ, ఇటీవల పడుతున్న వర్షాలు రైతుల్లో ఆశలు నింపాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి వరి సాగు సాధారణ విస్తీర్ణంలో 44.47 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 29.22 లక్షల ఎకరాల్లో సాగు అవ్వగా, ప్రస్తుతం అది 29.32 లక్షల ఎకరాలకు పెరిగింది.
Read Also: Telangana Gig Workers: గిగ్ వర్కర్లకు శుభవార్త
Paddy In Telangana
Paddy In Telangana : రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు సమగ్ర వివరాలు
మొత్తం వానకాలం సీజన్లో అన్ని రకాల పంటల సాధారణ లక్ష్యం 1,32,38,446 ఎకరాలు కాగా, ఇప్పటివరకు 92,86,726 ఎకరాల్లో (70.15%) విత్తనాలు వేయడం పూర్తయింది. ఆగస్టు నెలలో పడుతున్న వర్షాల వల్ల ‘ఎల్ నీనో’ ప్రభావం నుండి రైతులకు ఉపశమనం లభించిందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తమ నివేదికలో వెల్లడించింది. జూన్ మాసంలో 130.30 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 115 మి.మీ, జులైలో 227.40 మి.మీ కి గాను 222.90 మి.మీ నమోదు కాగా, ఈ నెలలో ఇప్పటివరకు సాధారణం (38.4 మి.మీ) కంటే కొద్దిగా ఎక్కువగా 39.1 మి.మీ నమోదు కావడం సాగుకు దోహదపడింది. జనగామ, హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం. (ఈ జిల్లాల్లోని 230 మండలాల్లో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంది). రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి. వర్షాభావం కొనసాగుతున్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన సమగ్ర నివేదికలో స్పష్టం చేసింది.
Epaper: epaper.vaartha.com

