Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్య సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి.. గవర్నర్!

విద్య సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి.. గవర్నర్!

వార్త 4 days ago

Governor Abdul Nazeer: ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత शक्तिవంతమైన ఆయుధం విద్య' అనే నెల్సన్ మండేలా సందేశాన్ని స్మరిస్తూ.. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ జస్టిస్ ఎస్.

అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.

మంగళవారం నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (VSU) లో నిర్వహించిన 10, 11, 12వ సంయుక్త స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

Read also: AP weather update: మరికాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు

ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు

ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్‌లకు విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్లను గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం డిగ్రీలు, పీజీ, పీహెచ్‌డీ పట్టాలతో పాటు బంగారు పతకాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.

నాక్ 'A' గ్రేడ్ సాధించడం గర్వకారణం

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గత 17 ఏళ్లుగా నాణ్యమైన విద్యాబోధన, పరిశోధనలతో విశేష ప్రగతి సాధించిందని గవర్నర్ కొనియాడారు. ఇటీవల నాక్ (NAAC) నుంచి 3.23 సీజీపీఏతో 'A' గ్రేడ్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే పీఎం-ఉషా (PM-USHA) కింద రూ. 20 కోట్ల నిధులు, డీప్ ఓషన్ మిషన్ కింద మెరైన్ బయాలజీ విభాగానికి రూ. 4.12 కోట్ల గ్రాంట్ రావడం వర్సిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, డిజిటల్ విద్యకు కొత్త ఊపునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Governor Abdul Nazeer: సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (AI) ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. ఉన్నత విద్యాసంస్థలు ఆధునిక సాంకేతికతను స్వీకరించి గ్రామీణ విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. కాలేజ్-టు-విలేజ్, ల్యాబ్-టు-ల్యాండ్ వంటి వర్సిటీ సామాజిక బాధ్యత కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Vikrama Simhapuri University Convocation Nellore

“ప్రపంచానికి మీ అత్యుత్తమ కృషిని అందించండి.. అప్పుడు ప్రపంచం కూడా మీకు అత్యుత్తమ అవకాశాలను, విజయాన్ని తిరిగి ఇస్తుంది.” - భారతరత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం మాటలను గుర్తుచేసిన గవర్నర్.

విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన "గో గ్రీన్" పర్యావరణ పరిరక్షణ చర్యలు, సౌరశక్తి వినియోగం, ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) లైబ్రరీ సేవలను గవర్నర్ ప్రశంసించారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వర్సిటీ అధికారులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

రేపు విశాఖకు వైఎస్ జగన్.. స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha