Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థులపై లాఠీఛార్జ్ సాధారణ శాంతిభద్రతల అంశమే:కేంద్ర మంత్రి జేపీ నడ్డా

విద్యార్థులపై లాఠీఛార్జ్ సాధారణ శాంతిభద్రతల అంశమే:కేంద్ర మంత్రి జేపీ నడ్డా

వార్త 1 week ago

Delhi Neet Protest: జూలై 20న నిర్వహించిన 'పార్లమెంట్ మార్చ్' సందర్భంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమర్థించుకున్నారు.

అది కేవలం ఒక "సాధారణ శాంతిభద్రతల (Law & Order) సమస్య" మాత్రమేనని, ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అనవసరంగా "రాజకీయం మరియు సంచలనం" చేస్తున్నాయని ఆయన రాజ్యసభలో విమర్శించారు. విద్యార్థులపై పోలీసుల ప్రవర్తన, పెల్లెట్ గన్స్ వినియోగంపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి నడ్డా ప్రభుత్వం తరఫున మాట్లాడారు.

Read Also:CJP NEET Protest: కేంద్రానికి CJP హెచ్చరిక.. కేసులు ఎత్తి వేయకపోతే మళ్లీ ఉద్యమిస్తాం

"నేనూ విద్యార్థి నాయకుడిగా అరెస్ట్ అయ్యాను": నడ్డా

రాజ్యసభలో నడ్డా మాట్లాడుతూ, చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడటానికే పోలీసులు ఆ సమయంలో చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. "విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనే ఎవరైనా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేనూ ఒకప్పుడు విద్యార్థి నాయకుడిగానే ఉన్నాను. కాంగ్రెస్ పాలనలోని ఎమర్జెన్సీ సమయంలో తరగతి గది నుంచి నన్ను కూడా పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేశారు" అని నడ్డా గుర్తుచేసుకున్నారు. పోలీసులు కేవలం తమ విధులను మాత్రమే నిర్వహించారని, దీనిపై ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Delhi Neet Protest: నిరసన తెలిపిన ప్రతిపక్షాలు.. ఖర్గే ఆగ్రహం!

మరోవైపు, నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం జరిగిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ఇతర విపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "విద్యార్థులపై దాడి చేసిన వారు హాయిగా తిరుగుతున్నారు. వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఖర్గే సభలో డిమాండ్ చేశారు. పోలీసుల చర్యలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటమే కాకుండా, భద్రతా బలగాలు తమపై పెల్లెట్ గన్స్ (Pellet Guns) ప్రయోగించారని విద్యార్థులు ఆరోపించడంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాయి. ఈ అంశంపై హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటన చేయాలని, లాఠీఛార్జ్‌కు ఆదేశించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేయడంతో రాజ్యసభలో తీవ్ర కలకలం రేగింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నీట్ నిరసనకారులపై ఎలాంటి చర్యలూ వుండవు : బెంగాల్ ప్రభుత్వం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha