Toing : దేశంలోనే అత్యంత సరసమైన ధరలకే ఆహారాన్ని డెలివరీ చేసే ప్రముఖ యాప్ 'టోయింగ్' (Toing) విజయవాడ నగరంలో తన సేవలను అధికారికంగా ప్రారంభించింది.
సెప్టెంబర్ 2025లో పూణే వేదికగా మొదలైన ఈ సరికొత్త యాప్, కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే దేశవ్యాప్తంగా చకచకా విస్తరించి, విజయవాడతో కలిపి మొత్తం 49 నగరాలకు చేరుకుంది. టోయింగ్ యాప్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే… ఇందులో లభించే ఆహార పదార్థాల ధరలు నేరుగా రెస్టారెంట్ టేబుల్ మెను ధరలతో సమానంగా లేదా వాటికంటే తక్కువగా ఉండేలా సంస్థ గ్యారెంటీ ఇస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులపై అదనపు భారంగా మారే ప్యాకేజింగ్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, ఎలాంటి ప్లాట్ఫారమ్ ఫీజులు (Zero Platform Fee) వసూలు చేయడం లేదు. దీనివల్ల కస్టమర్లు తమకు నచ్చిన బిరియానీలు, బర్గర్లు మరియు ఇతర రుచికరమైన వంటకాలను కేవలం రూ.99 లోపే ఆర్డర్ చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది.
యువత మరియు విద్యార్థులే టార్గెట్ – ప్రముఖ రెస్టారెంట్లతో జతకట్టడం
విజయవాడ నగరంలో కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాల్లో కొత్తగా చేరిన యువత (Gen Z) మరియు బడ్జెట్ పరిమితులు ఉండే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని టోయింగ్ సంస్థ ఈ నగరంలో అడుగుపెట్టింది. ఇప్పటికే నగరంలోని బెంగుళూరు భవన్, ఆర్ ఆర్ దర్బార్, సదరన్ స్పైస్, స్వీట్ మ్యాజిక్, ప్యారడైజ్, మెక్డొనాల్డ్స్, క్రీమ్ స్టోన్ వంటి ఎన్నో ప్రసిద్ధ రెస్టారెంట్లను తమ ప్లాట్ఫారమ్లో భాగస్వామ్యం చేసింది. దీని ద్వారా కస్టమర్లకు సౌత్ ఇండియన్, చైనీస్, పిజ్జాలు, మోమోస్ వంటి వైవిధ్యమైన ఫుడ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలో ఇప్పటికే 4.5 మిలియన్లకు (45 లక్షలు) పైగా డౌన్లోడ్లు, 4.5 రేటింగ్తో దూసుకుపోతున్న టోయింగ్ యాప్… ప్రస్తుతం విజయవాడతో పాటు కేరళలోని త్రిస్సూర్, కొచ్చి, కోజికోడ్ నగరాల్లో కూడా సేవలను విస్తరించింది. రోజువారీ ఆహార అవసరాల కోసం ఆన్లైన్ ఆర్డర్లపై ఆధారపడే మధ్యతరగతి వినియోగదారులకు ఈ యాప్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

