Vijay-Rashmika: టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్లో ఉన్న ఓ అద్భుతమైన ప్యాలెస్లో వీరి వివాహం జరగనుందని సమాచారం వెలువడింది. రాజస్ధానీ రాయల్ స్టైల్లో గ్రాండ్గా ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
Nandamuri Balakrishna: హిందూపురంలో ఇంటి నిర్మాణానికి భూమి పూజ

ఆహ్వానం వస్తే తాను తప్పక వెళ్తా
ఈ నేపథ్యంలో, ప్రముఖ కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను, నటుడు రక్షిత్ శెట్టిని రష్మిక పెళ్లికి ఆహ్వానించదని, ఇది అందరికీ తెలిసిన విషయమే అని ఆయన అన్నారు. ఒకవేళ ఆహ్వానం వస్తే తాను తప్పక వెళ్తానని ప్రమోద్ శెట్టి తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా 'కిరిక్ పార్టీ' సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో రిషబ్ శెట్టి, ప్రమోద్ శెట్టి కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే రక్షిత్, రష్మిక ప్రేమలో పడ్డారు. ఇద్దరూ గ్రాండ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ వివాహం చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు.
Read hindi news: hindi.vaartha.com

