Dailyhunt
Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

వార్త 3 months ago

వికారాబాద్(Vikarabad) రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో మహేశ్ (23) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తాండూరు వెళ్లేందుకు పర్భని-రాయచూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కిన సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

Read also: Bengaluru Crime: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మహిళా టెకీ మృతి

డోర్ సమీపంలో ప్రమాదం.. రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి

సమాచారం ప్రకారం, మహేశ్ రైలు డోర్ పక్కన ఉన్న వాష్‌బేసిన్ వద్ద ముఖం కడుక్కుంటుండగా అదుపు తప్పి(Vikarabad) జారి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో రైలు కింద పడిన యువకుడి రెండు కాళ్లు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి.

ఆసుపత్రుల్లో చికిత్స.. చివరకు మృతి

తీవ్ర గాయాలతో ఉన్న మహేశ్‌ను మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వైద్యులు రెండు కాళ్లు తొలగించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైళ్లలో ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Medak Crime: సొమ్ము కోసం తండ్రిని అంతమొందించిన తనయుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha