Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

వార్త 14 hrs ago

Ahmedabad Airport: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున సాగుతున్న బంగారపు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు.

దుబాయ్ నుంచి వచ్చిన ఒక విమానంలో అత్యంత వ్యూహాత్మకంగా దాచి ఉంచిన సుమారు రూ.4.26 కోట్ల విలువైన విదేశీ బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానంలోని టాయిలెట్ స్పీకర్ బాక్స్‌ను స్మగ్లర్లు ఇందుకోసం వాడటం గమనార్హం.

 Indigo Flight Gold Seizure

Read also: MK Stalin: టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. సీఎం విజయ్‌పై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

దుబాయ్ ఇండిగో విమానంలో కస్టమ్స్ మెరుపు తనిఖీలు

జూన్ 12న దుబాయ్ నుండి అహ్మదాబాద్ చేరుకున్న ఇండిగో విమానంలో భారీగా బంగారం అక్రమ రవాణా జరుగుతోందనే పక్కా సమాచారం కస్టమ్స్ విభాగానికి అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్ల సాయంతో విమానం లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విమానం ముందు భాగంలో ఉన్న టాయిలెట్‌లోని అనౌన్స్‌మెంట్ స్పీకర్ బాక్స్ వెనుక నల్లటి ప్లాస్టిక్ టేపుతో గట్టిగా చుట్టిన రెండు పౌచ్‌లను అధికారులు గుర్తించారు.

Ahmedabad Airport: 2.8 కిలోల స్వచ్ఛమైన బంగారం స్వాధీనం

ఆ రెండు పౌచ్‌లను విప్పి చూడగా అధికారులకు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. అందులో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 24 విదేశీ బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వీటి మొత్తం బరువు 2,799.3 గ్రాములు (సుమారు 2.8 కిలోలు) గా తేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.4,26,89,325 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ బంగారం తమదేనని అటు ప్రయాణికులు కానీ, ఇటు విమాన సిబ్బంది కానీ క్లెయిమ్ చేయకపోవడంతో కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం దీనిని ‘అన్‌క్లెయిమ్డ్‌’ సొత్తుగా మార్చుకుని సీజ్ చేశారు.

స్మగ్లర్ల పక్కా ప్లాన్.. రంగంలోకి దర్యాప్తు సంస్థలు

విమానం అంతర్జాతీయ ప్రయాణాన్ని ముగించుకుని దేశీయ సర్వీసుల్లోకి మారిన తర్వాత ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ లేదా లోకల్ ప్యాసింజర్ల ద్వారా ఈ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటకు తరలించాలని స్మగ్లర్లు ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భారీ గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు అహ్మదాబాద్ కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha