Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాంధ్ర వేదికపై చంద్రబాబును ప్రశంసించిన బాబా రాందేవ్‌

యోగాంధ్ర వేదికపై చంద్రబాబును ప్రశంసించిన బాబా రాందేవ్‌

వార్త 2 weeks ago

Baba Ramdev: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక గొప్ప యోగి, కర్మ యోగి అని పతంజలి యోగా పీఠం వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌ కొనియాడారు.

దేశంలోని ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు లాగే కష్టపడి పనిచేస్తే.. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం నిర్దేశిత సమయం కంటే ముందే సాకారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో బాబా రాందేవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పాల్గొని, రాందేవ్‌ బాబా ఆధ్వర్యంలో జరిగిన యోగసాధనను ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

read also:Chandrababu Naidu: అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు

విజనరీ లీడర్ చంద్రబాబు

ఈ సందర్భంగా బాబా రాందేవ్‌ మాట్లాడుతూ.. “సీఎం చంద్రబాబు నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచారు, కానీ నేను ఒక యోగా అతిథిగా ఇక్కడికి వచ్చాను. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం అందరికీ ఆదర్శం. చంద్రబాబు ఎల్లప్పుడూ అభివృద్ధిని కాంక్షించే అద్భుత దార్శనికత (విజన్) కలిగిన నేత” అని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘వికసిత్ భారత్’, ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ వంటి బృహత్తర ఆశయాల సాధనలో చంద్రబాబు తన వంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని, భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు విశ్వగురువుగా నిలిపేందుకు దోహదపడుతున్నారని పేర్కొన్నారు.

Baba Ramdev: అమరావతి ప్రకృతి అందాలు.. స్విట్జర్లాండ్‌లా ఉంది!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై బాబా రాందేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రజల రాజధానిగా పిలవబడే అమరావతి, ఇప్పుడు ‘యోగ రాజధాని’గా రూపాంతరం చెందింది. ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో, అద్భుతమైన నైసర్గిక స్వరూపంతో తీర్చిదిద్దుతున్న విధానం అద్భుతం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూస్తుంటే స్విట్జర్లాండ్‌ను తలపిస్తోంది” అని కొనియాడారు. ఈ పర్యటనలో భాగంగా ఉండవల్లి గుహల్లోని పద్మనాభ స్వామిని దర్శించుకున్నానని చెప్పిన ఆయన, ఏపీలో పండే మామిడి, అరటి పండ్లు ఎంతో రుచికరంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దపీట వేయడం అభినందనీయమని, ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు.. ప్రకృతి, సంస్కృతి, యోగా మరియు సర్వజనులను ప్రేమించే గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు.

వైభవంగా సాగిన యోగాభ్యాసం

ఈ ప్రత్యేక వేడుకలో బాబా రాందేవ్‌ తన శిష్య బృందంతో కలిసి పలు క్లిష్టమైన యోగాసనాలను వేసి చూపించారు. ఈ వినూత్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్‌లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha