Hormuz Strait: అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు ప్రపంచ ఇంధన రవాణాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ జలసంధి పై ఇరాన్ కఠిన ఆంక్షలు విధించడంతో అనేక దేశాల నౌకలు నిలిచిపోయాయి.
అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారతదేశం అసాధారణ విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో ఏకంగా 8 భారీ భారతీయ నౌకలు ఈ ప్రమాదకర జలసంధి గుండా ప్రయాణించి, లక్షల టన్నుల ఇంధనాన్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చాయి.
Read Also:US Attacks on Iran: భీకర దాడులు.. ఇరాన్ టాప్ మిలిటరీ లీడర్ల హతం

ఇరాన్ అల్టిమేటం.. భారత్కు గ్రీన్ సిగ్నల్
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిలో రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ ప్రకటించినప్పటికీ, భారత ప్రభుత్వ నిరంతర దౌత్య చర్చల ఫలితంగా మన నౌకలకు మార్గం సుగమమైంది. తమకు శత్రుత్వం లేని దేశాల నౌకలకు మరియు తమ నిబంధనలకు సహకరించే దేశాలకు అనుమతిస్తామని ఇరాన్ అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (IMO)కు స్పష్టం చేసింది. ఈ క్రమంలో మిత్రదేశమైన భారత్కు ఇరాన్ ప్రత్యేక వెసులుబాటు కల్పించడం గమనార్హం.
Hormuz Strait: లక్షల టన్నుల ఇంధనం.. భారత తీరాలకు రక్షణగా యుద్ధ నౌకలు
మార్చి నెలలో వరుసగా భారత నౌకలు ఇంధన నిల్వలతో స్వదేశానికి చేరుకున్నాయి. మార్చి 16, 17 తేదీల్లో ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు గుజరాత్లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోగా, మార్చి 26 నుండి 28 మధ్య పైన్ గ్యాస్, జగ్ వసంత్ నౌకలు దాదాపు 92,612 టన్నుల ఎల్పీజీని తీసుకువచ్చాయి. అలాగే యూఏఈ నుండి 80,886 టన్నుల ముడి చమురుతో వచ్చిన ‘జగ్ లాడ్కీ’ కూడా సురక్షితంగా తీరం చేరింది. ఈ వాణిజ్య నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా భారత నౌకాదళ యుద్ధ నౌకలు నిరంతరం పహారా కాస్తూ రక్షణ కల్పించడం విశేషం.
బాబ్ ఎల్-మందేబ్ జలసంధిపై నీలినీడలు.. ప్రపంచ వాణిజ్యానికి ముప్పు?
హార్మూజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్, ఇప్పుడు మరో కీలకమైన బాబ్ ఎల్-మందేబ్ జలసంధిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. గోధుమలు, బియ్యం, చమురు రవాణాలో ఈ మార్గం వాటా గురించి ఆయన ప్రస్తావించడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ఈ మార్గాన్ని కూడా ఇరాన్ మూసివేస్తే ప్రపంచ సరఫరా గొలుసు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
"నరకపు ద్వారాలు తెరుచుకుంటాయి" అంటూ ట్రంప్ అల్టిమేటంపై ఇరాన్ కౌంటర్

