Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1,127కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..వరదలకు కారణాలు..

1,127కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..వరదలకు కారణాలు..

వార్త 2 weeks ago

Nepal Flood Death Toll : నేపాల్‌లో సంభవించిన తీవ్ర ఆకస్మిక వరదలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. విపత్తు తీవ్రత పెరగడంతో బాధితుల సంఖ్య పెరగడమే కాకుండా సహాయక చర్యలు సైతం సంక్లిష్టంగా మారాయి.

వరద ప్రమాదం కారణంగా దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకుంది. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం వివిధ జిల్లాల్లో లభ్యమైన మృతదేహాల వివరాలు: చిత్వాన్: 348తూర్పు నవల్‌పరాసి: 217పశ్చిమ నవల్‌పరాసి: 190నౌవాకోట్ (నువాకోట్): 155గూర్ఖా: 66ధాడింగ్: 59 రసువా: 45 తనహున్: 38. వరద నీటిలో కొట్టుకుపోయిన మరో తొమ్మిది మంది మృతదేహాలను సరిహద్దులు దాటి భారత్‌లోని ప్రాంతాల్లో గుర్తించినట్లు నేపాల్ పోలీసులు ధ్రువీకరించారు.

Read Also: Nepal Floods : రంగంలోకి సోనూసూద్

 Nepal Flood Death Toll

వాతావరణ మార్పులే ప్రధాన కారణం: ప్రధాని బాలేంద్ర షా

ఈ ఆకస్మిక విపత్తుకు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులే ముమ్మాటికీ కారణమని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా స్పష్టం చేశారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల మేర పెరగడం వల్లే ఇటువంటి అనూహ్య మార్పులు సంభవించాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచదేశాల సమస్య అయినందున, దీనిని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్, చైనా దేశాల నుండి ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు.భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక రెస్క్యూ బృందం మరియు 5.5 టన్నుల అత్యవసర వైద్య సామగ్రితో ఐదో ప్రత్యేక విమానం నేపాల్‌కు చేరుకుంది. భారత్ ఇప్పటికే భారీగా ఆహారం, మందులు అందజేసింది.జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న 280 మందికి పైగా కార్మికులను భారత, చైనా నిపుణుల సాయంతో రక్షించారు. రసువాలోని మైలంగ్ ప్రాజెక్టు వద్ద మూసుకుపోయిన టన్నెల్ మార్గాన్ని తెరిచేందుకు కొండ భాగాలను పేల్చివేసి బాధితులను బయటకు తీశారు.

Nepal Flood Death Toll : పెరుగుతున్న నదుల ప్రవాహం - అప్రమత్తమైన యంత్రాంగం

వర్షాలు కొనసాగుతుండటంతో సన్ కోశి, బుద్ధి గండకి, మహాకాళి, కోశీ, నారాయణి, బాగ్మతి, కర్నాలి వంటి ప్రధాన నదులు మరియు వాటి ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.అధికారులు కంకాయ్, కమల, బబయి, తూర్పు రాప్తి, పశ్చిమ రాప్తి నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.పరిస్థితిని గమనించడానికి రసువాలోని తైమూర్ ప్రాంతంలో ప్రత్యేక సీసీటీవీ కెమెరాలను అమర్చారు.నదీ పరివాహక ప్రాంతాలు, రసువా, నువాకోట్, కాఠ్‌మండూ, లలిత్‌పూర్, ధాడింగ్, గూర్ఖా, కైలాలి, కంచన్‌పూర్ సహా పలు జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అధిక మొత్తంలో గ్రీన్ హౌస్ ఉద్గారాలను విడుదల చేస్తున్న అభివృద్ధి చెందిన మరియు పారిశ్రామిక దేశాల నుంచే వాతావరణ మార్పుల పరిణామాలు ఎదురవుతున్నాయని నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ పేర్కొన్నారు. దీనివల్ల దెబ్బతింటున్న నేపాల్ వంటి దేశాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత్, చైనా, అమెరికా వంటి దేశాలకు నేపాల్ ప్రభుత్వం లేఖలు పంపినట్లు తెలిపారు.

పాకిస్థాన్‌లో దారుణం.. 125 ఏళ్ల నాటి హిందూ దేవాలయం కూల్చివేత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha