Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
60 రావాల్సిన చోట 6 మార్కులు.. లెక్చరర్ కు జరిమానా, డిబార్!

60 రావాల్సిన చోట 6 మార్కులు.. లెక్చరర్ కు జరిమానా, డిబార్!

వార్త 1 week ago

Guntur News: గుంటూరు జిల్లా నూతక్కి ప్రాంతానికి చెందిన కావ్య అనే విద్యార్థిని ఇంటర్ బోటనీ పరీక్షలో అద్భుతంగా రాసింది. ఫలితాలు చూస్తే ఆమెకు కేవలం 6 మార్కులు మాత్రమే వచ్చాయి.

దీంతో షాక్ తిన్న విద్యార్థిని రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. మళ్లీ తనిఖీ చేయగా ఆమెకు అసలైన 60 మార్కులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Read also: Tirupati News: అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

 Inter student Kavya botany marks issue

Guntur News: లెక్చరర్‌పై కఠిన చర్యలు

ఈ తీవ్రమైన పొరపాటుకు బాధ్యుడైన లెక్చరర్‌ను ఇంటర్ బోర్డు వదిలిపెట్టలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు సదరు అధ్యాపకుడికి 7,500 రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా వచ్చే మూడేళ్ల వరకు బోర్డు పరీక్షల మూల్యాంకన విధుల్లో పాల్గొనకుండా డిబార్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

బోర్డు హెచ్చరికలు

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పేపర్ దిద్దే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఇతర అధ్యాపకులను కూడా హెచ్చరించారు. కావ్యకు జరిగిన ఈ అన్యాయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలు వేగవంతం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha