Nepal Floods: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మంచుచరియలు (Glacier) ఒక్కసారిగా విరిగిపడటంతో సంభవించిన భయాానక వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.
ఈ జలప్రళయం దాటికి ఇప్పటివరకు లభించిన మృతదేహాల సంఖ్య 750 దాటగా, వేలాది మంది ప్రజలు గల్లంతయ్యారు.
Read Also :Nepal Floods: నేపాల్లో జలప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య

ప్రళయానికి కారణం & నష్టం తీవ్రత
- మంచుచరియల విచ్ఛిత్తి: టిబెట్ సరిహద్దులోని రసువా (Rasuwa) జిల్లా పరిధిలో ఉన్న 'భోటే కోషి' (Bhote Koshi) నదిలో మంచుచరియ విరిగిపడటంతో హఠాత్తుగా భారీ ప్రవాహం ఉప్పొంగింది.
- మృతుల సంఖ్య: నేపాల్ మరియు టిబెట్ ప్రాంతాల్లో కలిపి ఇప్పటివరకు కనీసం 750 మృతదేహాలను వెలికితీశారు.
- గల్లంతైనవారు:2,000 మందికి పైగా అడ్రస్ లేకుండా పోయారని అధికారులు తెలిపారు. వీరిలో 275 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.
Nepal Floods: సహాయక చర్యలు
వరద ప్రవాహానికి వందలాది ఇళ్లు, వంతెనలు, రహదారులు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వర్షాలు, నదీ ఉద్ధృతి తగ్గకపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
అయ్యో ..'భార్య చికిత్స కోసం దాచుకున్న రూ.25 లక్షలు, బంగారం కొట్టుకుపోయాయి' !!

