Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
85 వేల మంది మహిళల ఉపాధిపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం: జగన్

85 వేల మంది మహిళల ఉపాధిపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం: జగన్

వార్త 1 week ago

YS Jagan: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేస్తూ జీవనం సాగిస్తున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల జీవితాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతలాకుతలం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా నమ్ముకుని పనిచేస్తున్న నిరుపేద మహిళలను ‘స్మార్ట్ కిచెన్స్’ అనే సరికొత్త నెపంతో తొలగించి, ఆ స్థానంలో కూటమి పార్టీల అనుచరులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే గత రెండు నెలలుగా ఆ కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను ఇవ్వకుండా ప్రభుత్వం బకాయి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 YSRCP,

read also: Rain update: జూన్ 30వ తేదీ వరకూ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

YS Jagan: గతంలో పెంచిన గౌరవ వేతనం.. నేడు బకాయిలతో వేధింపులు!

గతంలో మధ్యాహ్న భోజన కార్మికులకు కేవలం రూ. 1,000 మాత్రమే ఉన్న వేతనాన్ని, తాము అధికారంలోకి రాగానే మానవత్వంతో రూ. 3,000 వరకు పెంచిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో భోజన కార్మికులకు మరింత మేలు చేస్తామని నమ్మబలికిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని ఉన్నపళంగా రోడ్డున పడేసేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.

బాధిత మధ్యాహ్న భోజన కార్మికుల పక్షాన నిలబడి వైఎస్సార్సీపీ నిరంతర పోరాటం చేస్తుందని, వారికి అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిపివేసిన రెండు నెలల జీతాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల హామీల మేరకు వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని మరింత పెంచాలని ఆయన పట్టుబట్టారు.

Read hindi news : hindi.vaartha.com

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha