Srinivas Goud: బీఆర్ఎస్ కీలక నేత, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను లక్ష్యంగా చేసుకుని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం హత్యకు కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రవీణ్ కుమార్కు ఉన్న సెక్యూరిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తగ్గించిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రశ్నించారు.

read also: Kishan Reddy: ఖరీఫ్కు ఎరువుల కొరత లేదు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
ఇంటెలిజెన్స్ నివేదికను బహిర్గతం చేయాలి
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే భద్రతను కుదించారని మండిపడ్డ శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పూర్తిగా తొలగించాలని లేదా తగ్గించాలని ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారులు ఏమైనా నివేదికలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒకవేళ నిజంగానే అలాంటి నివేదిక ఉంటే, దానిని ప్రభుత్వం ఎందుకు రహస్యంగా ఉంచుతోందని నిలదీశారు. తక్షణమే ఆ ఇంటెలిజెన్స్ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Srinivas Goud: ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత!
గతంలో ఉన్నతాధికారిగా పనిచేసి, ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉంటున్న నాయకుడి భద్రతతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. “ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఉన్న రక్షణను తగ్గించడం ద్వారా ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. భవిష్యత్తులో ఆయనకు ఏ చిన్న అపాయం జరిగినా, దానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.”
Read hindi news : hindi.vaartha.com

