Dailyhunt
ఆర్టీసీ కార్మికుల కోసం తెలంగాణ బంద్ కు సిద్ధం: కవిత

ఆర్టీసీ కార్మికుల కోసం తెలంగాణ బంద్ కు సిద్ధం: కవిత

వార్త 1 week ago

RTC strike: ఆర్టీసీ సమస్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

హక్కుల సాధన కోసం ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, ధైర్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ ను ఆమె గట్టిగా వినిపించారు.

Read also: Elections Record Polling: బెంగాల్, తమిళనాడులో పోటెత్తిన ఓటర్లు.. 2021 కంటే భారీగా పోలింగ్ నమోదు

 Kavitha supports RTC workers rights

RTC strike: హక్కుల పోరాటం కోసం ఐక్యంగా ఉందాం

కార్మికులు ఎవరూ మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని కవిత కోరారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో హక్కుల కోసం మళ్ళీ పోరాడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. మనోధైర్యంతో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కార్మికుల పక్షాన నిలబడి అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.

అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్ కు నిర్ణయం

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా వెనకాడబోమని కవిత ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియను వేగవంతం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

టీఎంసీదే అధికారం: మమతా బెనర్జీ ధీమా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha