తెలుగు సినీ పరిశ్రమలో వినూత్నమైన కార్యక్రమంగా సీతా పయనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది. ఈ, ఈవెంట్ లో ముగ్గురు రియల్ హీరోలను సన్మానించారు.
70 ఎకరాల భూమిని అడవిగా మార్చిన దుశ్చర్ల సత్యనారాయణ, గిరిజనులకు సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రకాష్ ఆప్టే-మందాకిని ఆప్టే దంపతులు, ట్యాంక్ బండ్ శివ లను గౌరవించారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును సేవా కార్యక్రమాల కోసం అందించారు. దర్శకుడు అర్జున్ (Actor Arjun), బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీతా పయనం ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
Yash: 'టాక్సిక్' మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

వారి నుంచి స్ఫూర్తి
ఈ వేదికపై ట్యాంక్ బండ్ శివ ఎమోషనల్ స్పీచ్ ఆద్యంతం హృదయాలను గెలుచుకుంది. అతడు అర్జున్, బ్రహ్మానందంలపై తన అభిమానాన్ని కనబరిచిన తీరు, వారిని స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన విషయాలను వర్ణించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.ట్యాంక్ బండ్ శివ మాట్లాడుతూ…అనాధగా పెరిగి పెద్దయ్యాను.
యాదగిరీ టాకీస్ లో అహనా పెళ్లంట సినిమా చూసినప్పుడు బ్రహ్మానందం గారిని చూసాను.. మన్నెంలో మొనగాడు సినిమాలో అర్జున్ (Actor Arjun) గారిని చూసాను.. ఆయన హీరోయిన్ ని కాపాడుతారు అందులో. ఒకే ఒక్కడు, జెంటిల్ మేన్ ఎన్నో గొప్ప సినిమాల్లో అర్జున్ నటించారు. అర్జున్, బ్రహ్మానందం వంటి వారి నుంచి స్ఫూర్తిని పొందుతాను` అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com

