టాలీవుడ్లో ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.'మన శంకర వరప్రసాద్' సినిమా 300 కోట్ల క్లబ్లో చేరిన తర్వాత, నాగార్జున లేదా వెంకటేష్తో సినిమా చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తన కొత్త సినిమాపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ఇంకా ప్రాజెక్టుకు సంబంధించి తాను పేపర్పై పెన్ను కూడా పెట్టలేదని,
Assets: సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న శర్వానంద్

మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను
అప్పుడే పూర్తి వివరాలు ఎలా ప్రచారంలోకి వచ్చాయని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, 'నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు. ఇంకా నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి, ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన, పూర్తి వివరాలు మీకు అందిస్తాం' అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com

