Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు భారీ భద్రత..పోలీసుల హైలెవల్ మీటింగ్

అమరావతి హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు భారీ భద్రత..పోలీసుల హైలెవల్ మీటింగ్

వార్త 1 week ago

AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలోని శాశ్వత హైకోర్టు భవన సముదాయంతో పాటు కొత్తగా నిర్మించిన న్యాయమూర్తుల నివాసాలకు (జడ్జెస్ విల్లాలు) అసాధారణ రీతిలో బహుళ అంచెల భద్రతను కల్పించాలని పోలీసు శాఖ నిర్ణయించింది.

ఈ కీలక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు 24 గంటల పాటు నిరంతర నిఘా ఉండేలా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 AP Police Security Plan

Read also:Chandrababu Naidu: 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

వెలగపూడిలో ఉన్నత స్థాయి సమీక్ష.. కీలక మార్గదర్శకాలు జారీ

ఈ భద్రతా ఏర్పాట్లపై నిన్న వెలగపూడిలోని డీఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి పాల్గొని భద్రతకు సంబంధించిన పలు కీలక మార్గదర్శకాలను అధికారులకు జారీ చేశారు. అందులో భాగంగా రోజంతా నిరంతరాయంగా సిబ్బంది విధుల్లో ఉండేలా చూడటం, అత్యాధునిక సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ నిఘా ఏర్పాటు, సందర్శకుల వివరాల నమోదుపై కఠినమైన ఆంక్షలు విధించడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను (QRT) సిద్ధం చేయడం, ప్రముఖుల (VVIPs) రాకపోకల సమయంలో ప్రత్యేక రూట్ సెక్యూరిటీ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ మరియు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

AP High Court: రూ.210 కోట్లతో నిర్మించిన విల్లాలు.. ముందస్తు జాగ్రత్త చర్యే

తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో సుమారు రూ. 210 కోట్ల భారీ వ్యయంతో ఈ జడ్జీల నివాస సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ ఏడాది ఆరంభంలోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ చేతుల మీదుగా ఈ విల్లాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. హైకోర్టు శాశ్వత భవనాలు అమరావతి వేదికగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న తరుణంలో, న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాలకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించడంపై యంత్రాంగం దృష్టి పెట్టింది.

సమావేశం ముగిసిన అనంతరం ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయికి వెళ్లి ప్రస్తుత సెక్యూరిటీ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించింది. అయితే, ప్రస్తుతం ఎలాంటి నిర్దిష్ట ముప్పు లేదా హెచ్చరికలు లేవని, కేవలం భద్రతా పరమైన ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha