Dailyhunt
అమరావతి పనులా లేక ప్రజల కష్టాలా?: షర్మిల

అమరావతి పనులా లేక ప్రజల కష్టాలా?: షర్మిల

వార్త 1 week ago

AP Politics: రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సమస్యపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సర్కారును నిలదీశారు. పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తుంటే ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం పాకులాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా అవసరాలను గాలికి వదిలేసి కేవలం అమరావతి పనులకే ప్రాధాన్యత ఇవ్వడం దారుణమని ఆమె విమర్శించారు.

Read also: TDP Mahanadu 2026: టీడీపీ మహానాడు వేదిక మార్పు.. కారణం అదేనా?

 People waiting at fuel station in AP

AP Politics: రైతును కాదని కాంట్రాక్టర్లకే మేలా?

డీజిల్ దొరక్క రైతులు పొలాల్లో పనులు చేసుకోలేక అల్లాడిపోతుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యుల ఇబ్బందుల కంటే బడా కాంట్రాక్టర్ల లాభాలే ప్రభుత్వానికి ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా డీజిల్ కోటా కేటాయించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆమె నేరుగా ప్రశ్నించారు.

ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు

ముందుగా రైతులకు, సామాన్యులకు ఇంధనం అందేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ కేవలం నిర్మాణ పనుల మీద దృష్టి పెడితే భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా పాలనలో ప్రాధాన్యతలు మార్చుకోవాలని, ప్రజల కష్టాలను తీర్చడమే మొదటి కర్తవ్యంగా పెట్టుకోవాలని ఆమె సూచించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సీఎం మార్పుపై మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha