Dailyhunt
అమరావతికి దక్కిన గుర్తింపు.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

అమరావతికి దక్కిన గుర్తింపు.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

వార్త 2 weeks ago

Amaravati: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టపరంగా గుర్తించడంతో పాటు, అభివృద్ధి పనులు వేగవంతం కావడంపై ఆ ప్రాంత రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమ ఇష్టదైవమైన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు భారీ కాలినడక యాత్రను చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక నేతలు, వందలాది మంది రైతులు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Read Also: BJP Foundation Day: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

 ‘Jai Amaravati’ slogans were raised at Indrakiladri.

Amaravati: ఇంద్రకీలాద్రిపై మొక్కుల చెల్లింపు

వారధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు సాగిన ఈ పాదయాత్ర ‘జై అమరావతి’ నినాదాలతో హోరెత్తింది. మహిళలు సాంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర సారెను అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడం తమ ఐదేళ్ల పోరాటానికి దక్కిన విజయంగా రైతులు అభివర్ణించారు. అమ్మవారి ఆశీస్సులతో రాజధాని నిర్మాణం ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు పడుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తాము పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని, రాజధాని ప్రాంతం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. రాజధాని నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha