BJP Foundation Day: భారతీయ జనతా పార్టీ (BJP) 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
దేశాభివృద్ధిలో బీజేపీ పోషిస్తున్న పాత్రను వారు ఈ సందర్భంగా కొనియాడారు.
Read Also: Indian Bureau of Mines: దేశవ్యాప్తంగా మూతపడిన 1,374 గనులు
దేశ ప్రగతిలో బీజేపీ ముద్ర
దేశ ప్రయోజనాలే పరమావధిగా బీజేపీ ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విప్లవాత్మక నిర్ణయాలతో భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ఆ పార్టీ కృషి మరువలేనిదని కొనియాడారు. కష్టకాలంలోనూ దృఢమైన నాయకత్వంతో దేశ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసిందని ప్రశంసించారు.
BJP Foundation Day: ఏపీ అభివృద్ధికి కేంద్రం తోడ్పాటు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం వెన్నుదన్నుగా నిలుస్తోందని, డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్, లోకేశ్ ట్వీట్స్
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. దేశాన్ని శక్తిమంతమైన మార్గంలో నడిపిస్తున్న బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలిపారు. మంత్రి లోకేశ్ కూడా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, దేశాభివృద్ధిలో కమలం పార్టీ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

