Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా-ఇరాన్ దాడులతో చమురు ధరలకు రెక్కలు

అమెరికా-ఇరాన్ దాడులతో చమురు ధరలకు రెక్కలు

వార్త 2 weeks ago

Iran-America War : అంతర్జాతీయ ఇంధన విపణిలో తీవ్ర అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో..ప్రపంచ నౌకా రవాణా మార్గాల్లో సైనిక ఘర్షణలు, ప్రపంచపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా తీసుకున్న నిర్ణయం గ్లోబల్ మార్కెట్లను ఊపేస్తున్నాయి.

అమెరికా, ఇరాన్‌ల మధ్య ముదురుతున్న సైనిక దాడులు, ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకా రాకపోకల భయాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ముడి చమురు ధరలు సుమారు 1 శాతం మేర పుంజుకున్నాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 87 సెంట్లు లేదా 0.92 శాతం పెరిగి $95.52కు చేరుకోగా, అమెరికన్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 80 సెంట్లు లేదా 0.89 శాతం పెరిగి $91.02 స్థాయిని తాకింది.

Read Also: Pakistan : మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టిన పాకిస్థాన్

 Iran-America War

ఇంధన సంక్షోభాన్ని మరింత కఠినతరం చేస్తూ

అంతకుముందు రోజు ట్రేడింగ్‌లోనూ ఇరు రకాల చమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా $4 కంటే ఎక్కువ పెరిగాయి. బ్రెంట్ చమురుకు జూలై 24 తర్వాత, డబ్ల్యూటీఐ చమురుకు జూలై 23 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు పెరుగుదలగా నమోదవడం ఇంధన విపణిలోని తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ.. రష్యా ప్రభుత్వం 2026 సంవత్సరానికి తన చమురు ఉత్పత్తి అంచనాను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన వివరాల ప్రకారం.. రష్యా తన చమురు ఉత్పత్తిని 17 ఏళ్ల కనిష్ట స్థాయికి సవరిస్తూ 2026 ఉత్పత్తి లక్ష్యాన్ని 494.2 మిలియన్ మెట్రిక్ టన్నులకు (రోజుకు 9.88 మిలియన్ బ్యారెళ్లు) కుదించింది. ఉక్రెయిన్ సంక్షోభం, సుదీర్ఘ పోరాటం, రష్యా రిఫైనరీలపై జరిగిన ద్రోన్ దాడులు, పాశ్చాత్య దేశాల ఆంక్షల పర్యవసానంగా ఉత్పత్తి అంచనాలను దాదాపు 17.2 మిలియన్ టన్నుల మేర తగ్గించవలసి వచ్చిందని సమాచారం.

Iran-America War : అంతర్జాతీయ చమురు ట్యాంకర్లపై దాడులు

పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనిక స్థావరాలు, అంతర్జాతీయ చమురు ట్యాంకర్లపై దాడులు చేసేందుకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) యత్నిస్తోందనే ఆరోపణలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) రాత్రికి రాత్రే ఇరాన్‌లోని వ్యూహాత్మక మిలిటరీ లక్ష్యాలపై దాడులు జరిపింది. యూఎస్ దాడుల వార్తలను ప్రతిఘటిస్తూ ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. జోర్డాన్‌లోని ఒక అమెరికా మిలిటరీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడ్డామని.. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఐఆర్‌జీసీ వెల్లడించింది. దీనికి అదనంగా, బహ్రెయిన్‌లో ఉన్న కీలక యూఎస్ సైనిక స్థావరంపై భారీగా డ్రోన్‌ల దాడి జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. గత కొన్ని వారాలుగా ఇరు దేశాల మధ్య తీవ్రరూపం దాలుస్తున్న క్షిపణి యుద్ధం హార్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణాను పూర్తిగా నిలిపివేస్తుందనే భయాలు చమురు వ్యాపారులను కలవరపెడుతున్నాయి. రష్యా నుంచి తగ్గుతున్న చమురు ఉత్పత్తి అంచనాలు ఒకవైపు, మధ్యప్రాచ్యంలో రగిలిన యుద్ధజ్వాలల వల్ల స్తంభిస్తున్న సరఫరాలు మరొకవైపు ఉండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ సహా ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లపై ఈ పరిణామాలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

ప్రపంచ సాయాన్ని కోరుతున్న నేపాల్-పెరుగుతున్న మృతుల సంఖ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha