Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్రాబాద్ సమీపంలో బస్సు-కారు ఢీ!

అమ్రాబాద్ సమీపంలో బస్సు-కారు ఢీ!

వార్త 3 weeks ago

Amrabad road accident: నగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు మరియు కారు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also:Meerpet Chit Fund Scam: మీర్‌పేటలో భారీ చిట్ ఫండ్ మోసం! రూ. 2 కోట్లతో భార్యాభర్తలు జంప్

బస్సు అద్దాల్లోంచి బయటపడి మహిళ మృతి

శ్రీశైలం క్షేత్రం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వేగానికి కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో బస్సు అద్దాలు పగిలిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు అద్దాల గుండా బయట పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన తీరు ప్రత్యక్ష సాక్షులను సైతం భయాందోళనలకు గురిచేసింది.

Amrabad road accident: చికిత్స పొందుతూ మరొకరు మరణం.. నలుగురి పరిస్థితి విషమం

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు.

ఈ ప్రమాదం కారణంగా శ్రీశైలం హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha