Anantapur: శుక్రవారం అనంతపురం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు డి.మరిస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర వినియోగదారుల ఉపాధ్యక్షుడిగ ఎన్నికైన డి.
హిరేహళ్ మండలం సోమలాపురం ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ శ్రీనివాసులు కు ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సంజీవరాయుడు సమన్వయం కర్తగ వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల సంఘాల సమాఖ్యకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగ ఎన్నికైన ఆర్. శ్రీనివాసులు ను గుత్తి డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారి లక్ష్మన్న, బుక్కపట్నం డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సబ్ రిజిస్ట్రార్ శ్రీ కవి రాజు, జిల్లా సహకార బ్యాంకు అధికారి బండి నాగరాజు, ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీ. నరేష్, సొంటెల ధనుంజయ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Read Also: Tirupati SC Morcha President: బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా హర్షవర్ధన్
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

