Tirupati SC Morcha President: భారతీయ జనతా పార్టీ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆదేశాల ప్రకారం తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు గా పెనుబాల హర్షవర్ధన్ ని నియమించడం జరిగింది.
Read Also: Anantapur: మాజీ సర్పంచ్ రుద్రేశ్కు ఘన నివాళి

Tirupati SC Morcha President: సమావేశంలో పాల్గొన్న ముఖ్య నేతలు
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు , బీజేపి రాష్ట్ర మహిళా మోర్చనాయకురాలు గాలి పుస్పలత, రాష్ర్ట దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కొండేటి ప్రేమ్, రాష్ట్ర ఎస్సీ మోర్చ ఐ టి సేల్ కన్వీనర్ కాకి లక్ష్మి నరేష్, బి జే వై ఎం రాష్ట్ర నాయకులు జీవన్ రాయల్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డా. కదిరి నరేష్ బాబు, బీడీ బాలాజీ, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వేదవతి రాయల్, మల్ల కుప్పం శేఖర్ ,ప్రశాంతి రాజు, బి జే వై ఎం తిరుపతి జిల్లా అధ్యక్షుడు బండారు పార్ధసారధి, మైనార్టీ మోర్చా తిరుపతి జిల్లా అధ్యక్షుడు మస్తాన్, కిసాన్ మోర్చ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డా.పెనుబాల చంద్రశేఖర్ గారు, గవ్వల అశోక్, తిరుపతి వెస్ట్ మండల అధ్యక్షుడు తెల్లాకుల శ్రీధర్, నార్త్ మండల అధ్యక్షుడు, ప్రభాకర్ నాయుడు, మాజీ మండల అధ్యక్షుడు శరత్ కుమార్ వన్నెరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెనుబాల హర్ష వర్ధన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ కి, రాష్ట్ర ఎస్సీ మోర్చ అధ్యక్షుడు పనతల సురేష్ కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర రెడ్డి కి, నాగోతు రమేష్ నాయుడు కి, బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ కి, టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కి, ఆంద్ర ప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వర ప్రసాదకి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలయ జేశారు
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

