Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం

అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్‌నాథ్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం

వార్త 2 weeks ago

Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

read also: Nara Lokesh: జులైలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు

మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తూ, మహిళా ప్రజాప్రతినిధిని ఆమె రూపం లేదా దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం విమర్శించడం సరైన రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విధానాలు, పాలనపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అనుచితమని అన్నారు.

Rayapati Shailaja: మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు

ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మహిళా సమాజం మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఉంటాయని శైలజ అభిప్రాయపడ్డారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు వారిని నిరుత్సాహపరచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌కు పలువురు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కేవలం వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించే విధంగా స్పందించడం కూడా ఆందోళన కలిగించే అంశమని కమిషన్ భావిస్తోంది.

డీజీపీకి లేఖ.. అమర్‌నాథ్‌కు సమన్లు

ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన మహిళా కమిషన్, గుడివాడ అమర్‌నాథ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఈ అంశంపై వివరణ కోరేందుకు అమర్‌నాథ్‌కు సమన్లు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha