Delhi GTB hospital incident: ఢిల్లీలోని గురుతేగ్ బహదూర్ (GTB) ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న మొహమ్మద్ అక్బర్ (42) అనే రోగిపై ఒక్కసారిగా సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది.
ఈ ఊహించని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు రోగి అక్కడికక్కడే మరణించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలోని మౌలిక వసతుల నిర్వహణ లోపం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ రోగి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు.
Read Also: Sonam Wangchuk: దీక్ష విరమణకు సిద్ధమైన సోనమ్ వాంగ్చుక్.. కేంద్రానికి 3 కీలక డిమాండ్లు
Tragedy at the hospital: Patient dies after ceiling fan falls on them.
Delhi GTB hospital incident: ఫ్యాన్ పడటం వల్లే చనిపోయాడంటున్న ప్రత్యక్ష సాక్షులు
ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు, మృతుడి బంధువులు ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్ చాలా బలంగా రోగిపై పడిందని, ఆ దెబ్బకే అతను ప్రాణాలు కోల్పోయాడని వారు స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగుల భద్రతను గాలికొదిలేశారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై గురుతేగ్ బహదూర్ ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ భిన్నమైన ప్రకటన చేసింది. సదరు రోగి మొహమ్మద్ అక్బర్ ఆస్పత్రిలో చేరకముందు నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని పేర్కొంది. ఆయన మరణానికి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడటం కారణం కాదని, అనారోగ్య పరిస్థితుల వల్లే మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Epaper: epaper.vaartha.com
2027లో అందుబాటులోకి రానున్న కాగితపు కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ

