Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత వైద్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు మార్గదర్శకం: పల్లా శ్రీనివాసరావు

భారత వైద్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు మార్గదర్శకం: పల్లా శ్రీనివాసరావు

వార్త 2 weeks ago

Palla Srinivasa Rao: భారతదేశ ఆరోగ్య రంగంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా 'ప్రోటిజెనిక్స్ లైఫ్ సైన్సెస్' సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు.

విదేశాల్లో స్థిరపడిన తెలుగువారు ఈ సంస్థను ఒక రోల్ మోడల్‌గా తీసుకుని, సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం విశాఖపట్నంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను ఆయన సందర్శించి, సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 Visakhapatnam Genome Valley

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “అత్యంత కీలకమైన ప్లాస్మా ఆధారిత మందుల తయారీని దేశీయంగా ప్రోత్సహిస్తూ.. భారతీయ ఔషధ రంగాన్ని బలోపేతం చేయడంలో ప్రోటిజెనిక్స్ పాత్ర ప్రశంసనీయం. వైద్య రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ కల సాకారం కావడానికి ఇలాంటి పరిశ్రమల అవసరం ఎంతో ఉంది” అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ప్లాస్మా ప్రోటీన్ థెరప్యూటిక్స్‌పై పరిశోధనలు, ఉత్పత్తి చేపట్టిన మొట్టమొదటి సంస్థ ఇదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Read also: Baba Ramdev: యోగాంధ్ర వేదికపై చంద్రబాబును ప్రశంసించిన బాబా రాందేవ్‌

ప్రాణాధార ఔషధాల తయారీలో అగ్రగామి

గత 2021వ సంవత్సరంలో ఎన్నారై (NRI) వైద్యుల బృందం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సంస్థ.. తక్కువ కాలంలోనే విశేష గుర్తింపు తెచ్చుకుంది. రోగనిరోధక శక్తి లోపాలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, తీవ్ర రక్తస్రావ సమస్యల వంటి ప్రాణాంతక పరిస్థితుల నుంచి రోగులను కాపాడేందుకు ఉపయోగపడే హ్యూమన్ ఆల్బుమిన్, ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబులిన్ (IVIG), ఫ్యాక్టర్ VIII వంటి కీలకమైన ఉత్పత్తులను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

Palla Srinivasa Rao: పెట్టుబడులకు ఏపీ వేదిక.. ప్రభుత్వ పూర్తి మద్దతు

ప్రోటిజెనిక్స్ సంస్థ సాధిస్తున్న పురోగతిని స్ఫూర్తిగా తీసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసీయులు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పల్లా శ్రీనివాసరావు ఆకాంక్షించారు. విశాఖపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి, కొత్త పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణను పెంపొందించే ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు, కొత్తగా వచ్చే పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని మరియు పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha