Medchal Doctor Suicide: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘోర కలికలం రేగింది. రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో డాక్టర్ జోసఫ్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.
వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన, స్వయంగా ఇంజక్షన్ తీసుకుని తన ప్రాణాలను తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Read Also :Vijayawada crime: ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.5.28 కోట్ల టోకరా
18-Year Relationship Ends: Doctor’s Suicide Sparks Sensation in Medchal District.
18 ఏళ్ల వైవాహిక బంధం.. ఆర్థిక గొడవలే ప్రాణం తీశాయా?
మృతుడు డాక్టర్ జోసఫ్కు 18 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో తీవ్ర విభేదాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడి మరణానికి కోడలి వేధింపులే కారణమని జోసఫ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల విషయంలో ఆమె నిరంతరం వేధించడం వల్లే మనస్తాపానికి గురైన తన కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Medchal Doctor Suicide: పోలీసుల దర్యాప్తు ముమ్మరం
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ జోసఫ్ ఆత్మహత్యకు ముందు ఏవైనా సూసైడ్ నోట్ రాశారా లేదా అనే కోణంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 18 ఏళ్ల సంసారం ఇలా విషాదాంతం కావడం అటు వైద్య వర్గాల్లోనూ, ఇటు బంధువుల్లోనూ విషాదాన్ని నింపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
నారాయణపేటలో దారుణం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం

