Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం

బీమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం

వార్త 3 weeks ago

భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బీమా (Insurance) రంగంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ప్రస్తుతం ఉన్న 74% నుండి ఏకంగా 100 శాతానికి పెంచుతూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

అంటే ఇకపై విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థల్లో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను పొందే అవకాశం ఉంటుంది. అయితే, ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) విషయంలో మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయని, అక్కడ విదేశీ పెట్టుబడుల పరిమితి 20% గానే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read Also : గోల్డ్ బాండ్లతో లక్షకు రూ. 4.86 లక్షల లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం!

పెరగనున్న పోటీ.. తగ్గనున్న ప్రీమియం భారం

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ బీమా దిగ్గజాలు నేరుగా భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల బీమా రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతుంది. కంపెనీల మధ్య పోటీ పెరిగినప్పుడు, కస్టమర్లను ఆకర్షించడానికి సంస్థలు తక్కువ ధరకే మెరుగైన సేవలను అందించాల్సి ఉంటుంది. ఫలితంగా సామాన్యులు చెల్లించే ప్రీమియం ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అలాగే విదేశీ సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త రకమైన బీమా పాలసీలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.

ఆర్థిక వ్యవస్థకు చేకూరనున్న మేలు

బీమా రంగంలోకి వంద శాతం పెట్టుబడులు రావడం వల్ల దేశంలో భారీగా విదేశీ ద్రవ్యం వచ్చి చేరుతుంది. ఇది కేవలం బీమా రంగానికే కాకుండా, దేశ మౌలిక సదుపాయాల కల్పనకు కూడా దోహదపడుతుంది. ఎందుకంటే బీమా కంపెనీలు తమ వద్ద ఉన్న నిధులను దీర్ఘకాలిక ప్రాజెక్టులలో పెట్టుబడిగా పెడతాయి. అలాగే, ఈ రంగంలో కొత్త కంపెనీల రాకతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు సైతం బీమా సేవలు విస్తరించడం ద్వారా సామాన్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha