Karnataka Bus Accident: కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also :Pune Recovery Agent Attack: బాకీ కోసం నడిరోడ్డుపై వ్యక్తిపై దాడి!
KSRTC bus accident in Chitradurga district, Karnataka.
డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడ్డ బస్సు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచూరు నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న కేఎస్ఆర్టీసీ (KSRTC) బస్సు, చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకాలోని హెగ్గరె సమీపానికి చేరుకోగానే ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టి, రహదారిపైనే బోల్తా పడింది.
Karnataka Bus Accident: నిద్రమత్తు వల్లే ప్రమాదం?
తెల్లవారుజామున సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే బస్సు అదుపు తప్పి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చల్లకెరె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

