TRAI New Recharge Plans: దేశంలోని మొబైల్ వినియోగదారుల కోసం టెలికం నియంత్రణ సంస్థ (TRAI) కీలక ప్రతిపాదన చేసింది. కేవలం కాల్స్ మరియు ఎస్ఎంఎస్ ( SMS) సౌకర్యాలు మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు సూచించింది.
Read Also: Tamil Nadu Elections 2026: విజయ్ రాకపోయినా విగ్రహంతో నామినేషన్
‘Special’ recharge plans for those who don’t need data!
TRAI New Recharge Plans: డేటా అక్కర్లేని వారికి ఊరట
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రీఛార్జ్ ప్లాన్లు డేటాతో కూడి ఉంటున్నాయి. దీనివల్ల డేటా అవసరం లేని వినియోగదారులు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా సాధారణ ఫీచర్ ఫోన్లు వాడే వారు, కేవలం కాల్స్ మాట్లాడుకునే వృద్ధులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఈ ప్రతిపాదన చేసింది. వాయిస్ కాల్స్, మెసేజ్లు మాత్రమే ఉండే ప్లాన్లు అందుబాటులోకి వస్తే రీఛార్జ్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
వ్యాలిడిటీపై స్పష్టత
ప్రస్తుతం డేటా ప్లాన్లు ఏయే వ్యాలిడిటీలతో (ఉదాహరణకు 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు) అందుబాటులో ఉన్నాయో, అదే వ్యాలిడిటీలతో కేవలం ‘వాయిస్ + ఎస్ఎంఎస్’ ప్లాన్లను కూడా ప్రవేశపెట్టాలని టెలికం సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీనివల్ల వినియోగదారులకు తమ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్లను ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. త్వరలోనే జియో, ఎయిర్టెల్, విఐ వంటి కంపెనీలు ఈ దిశగా కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
విజయ్ పార్టీకి షాక్.. ఎడప్పాడి బరిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ!

