Jaggareddy Sangareddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (డీలిమిటేషన్) మరియు మహిళా బిల్లులోని లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Read Also: TG E-JAC Pending Issues Protest: ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
రాహుల్ గాంధీకి ‘సంగారెడ్డి’ మద్దతు
గతంలో ఇందిరా గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సంగారెడ్డి గడ్డ నుంచి రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Jaggareddy Sangareddy: జగ్గారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ను కంట్రోల్లో ఉంచుకునేందుకే బీజేపీ ఇష్టానుసారంగా డీలిమిటేషన్ ప్లాన్ చేసిందని ఆరోపించారు. ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడేలా ఈవీఎంలను డిజైన్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.”మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. మొదట యూపీఏ హయాంలో సోనియా గాంధీనే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం బీజేపీ తెచ్చిన బిల్లులో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దిన తర్వాతే బిల్లును అమలు చేయాలి” అని స్పష్టం చేశారు.
దేశ సంపదను దోచుకుంటున్న ‘హిస్సా చోరీ’పై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆయనకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని కోరారు.నాలుగోసారి అధికారంలోకి రావడానికి కేంద్రం ఎలక్షన్ కమిషన్ను తన గుప్పిట్లో పెట్టుకుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను అంచెలంచెలుగా లాగేసుకుంటోందని మండిపడ్డారు.సంగారెడ్డి చౌరస్తాలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

