Dailyhunt
ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌కు ఇరాన్ ముడి చమురు

ఏడేళ్ల తర్వాత తొలిసారిగా భారత్‌కు ఇరాన్ ముడి చమురు

వార్త 2 weeks ago

Iran Crude Oil: పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. దీంతో ఇరాన్ చమురును కొనుగోలు చేయడానికి భారతీయ రిఫైనరీలు ఆసక్తి చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఒక ఆయిల్ ట్యాంకర్ ఇటీవల భారత్‌కు బయలుదేరింది. మార్చి 4న ఖార్గ్ ద్వీపంలోని ట్యాంకర్‌లో చమురును నింపారు. ఇది ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు చేరుకుంటుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది.

Read Also: Belly Man: ఆ దేశంలో బొజ్జ అబ్బాయిలు అంటేనే అమ్మాయిలకు ఇష్టం!

 An oil tanker from Iran after seven years.

Iran Crude Oil: 2019 తర్వాత ఇదే తొలిసారి

2019 తర్వాత ఇరాన్ ముడి చమురు భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి ఇందులో సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండవచ్చని అంచనా అయితే ఇరాన్ నుండి వస్తున్న ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ ఉపయోగిస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

గతంలో భారతదేశం ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది ఒకానొక సమయంలో మొత్తం చమురు దిగుమతులలో ఇరాన్ వాటా సుమారు 11.5 శాతంగా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా, మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చావు అంచుల నుంచి స్వదేశానికి చేరుకున్న ఎనిమిదిమంది భారతీయ నావికులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha