Dailyhunt
ఎండ దెబ్బ మామూలుగా లేదుగా.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు!

ఎండ దెబ్బ మామూలుగా లేదుగా.. నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు!

వార్త 1 week ago

AP Weather Updates: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ రోజు ఏపీలోని 23 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

వేడి గాలుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read also: Hyderabad Rain Update: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

 Sun blazing over hot weather areas

AP Weather Updates: వడగాల్పులు వీచే జిల్లాలు ఇవే

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బాడంగి, బొబ్బిలి, రామభద్రాపురం వంటి మండలాల్లో వేడి గాలులు వీస్తాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. మొత్తం 23 మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది.

ప్రజలకు ముఖ్యమైన సూచనలు

వడదెబ్బ తగలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎండలో ప్రయాణించేటప్పుడు గొడుగు లేదా టోపీ వంటివి వెంట ఉంచుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి మంచి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షితంగా ఉండాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha