APRTC BUS: ఎన్టీఆర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఏపీ ఆర్టీసీ (APSRTC) బస్సులో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలముకోవడం తీవ్ర కలకలం రేపింది. జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ప్రయాణికులతో బయలుదేరిన ఈ బస్సులో ఊహించని విధంగా సాంకేతిక లోపం తలెత్తింది.
బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా లోపలికి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది.
Read Also : Chittoor: చిత్తూరు లో లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం
Missed threat.. Smoke in RTC bus.. Passengers jumped out of windows in fear!
APRTC BUS: ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్
బస్సు విజయవాడ వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్ భాగంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో క్షణాల వ్యవధిలోనే బస్సు ముందు భాగం నుంచి దట్టమైన పొగలు రావడం ప్రారంభమైంది. ఆ పొగలు బస్సు లోపలికి కూడా వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని వెంటనే గమనించిన బస్సు డ్రైవర్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును వెంటనే రోడ్డు పక్కకు నిలిపివేశారు.
ప్రాణభయంతో కిటికీల్లోంచి దూకేసిన జనం
బస్సు ఆగిన వెంటనే లోపల ఉన్న ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. పొగలు ఎక్కువగా వస్తుండటంతో బస్సు తగులబడిపోతుందేమోననే భయంతో కొందరు ప్రయాణికులు తలుపుల గుండా కిందకు దిగారు. అయితే ఊపిరాడక, తీవ్ర కంగారులో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఏకంగా బస్సు కిటికీల గుండా బయటకు దూకేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

