Vijayawada News:రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేటి నారాయణ అధికారులను కోరారు.
101 విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో బుధవారం మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్ను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతా ప్రాజెక్టుల అమలులో అధికారులు బాధ్యతా యుతంగా వ్యవహరిస్తూ, కేటాయించిన పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యమిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇంజనీరింగ్ పనుల్లో ఎదురవుతున్న భూ, సాంకేతిక, ఏజెన్సీ సమస్యల పరిష్కారం కోసమే ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లతో ప్రతి 15రోజులకు జోన్ల వారీగా సమీక్ష సమావేశా లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారూ. 2019లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
Read also: Aviation jobs for women: ఏవియేషన్ లో మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు
Minister Narayana orders acceleration of development works.
Vijayawada News:పారదర్శకత కోసం ఆన్లైన్ లో బిల్లులు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబి) ద్వారా రూ.5,350 కోట్లు నిధులు మంజూరు కాగా గత ప్రభుత్వం వాటిని వినియోగించుకోలేదని మంత్రి తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా మంజూరైన రూ.3 వేల కోట్లతోపాటు ఇతర ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదన్నారు. స్వచ్ఛాంధ్ర, గ్రీన్ మురుగునీటి శుద్ధి ప్రక్రియలో పూర్తిపారదర్శకత పాటించాలని, ప్రతి రూపాయి ఖర్చును ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించారు. మురుగునీటిని శుద్ధిచేసేందుకు ఎసిపి ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు నెల్లూరు, విజయవాడలో నిధులు మంజూరయినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 70 అన్నాక్యాంటిన్లు ఏర్పాటు చేసామని, మరో 5క్యాంటిన్లను పదిరోజుల్లో ప్రారంభం కానున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో 128 టన్నుల వ్యర్థాలను అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాలని నారాయణ ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఎపియుడిఐఎఫ్సి చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ, యండి. డాక్టర్ పి. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలగించామని తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

