Ration distribution: ఆంధ్రప్రదేశ్ రేషన్ పంపిణీలో సీబీడీసీ విధానం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
గుజరాత్లో విజయవంతంగా సాగుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పద్ధతిని ఏపీలో ప్రవేశపెట్టనున్నారు. మొదటగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని రేషన్ దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెడతారు. దీనివల్ల రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని మంత్రి తెలిపారు.
Read also: AP Heatwave Alert: ఏపీలో నిప్పుల కొలిమి.. రేపు 50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
CBDC System in Andhra Pradesh Ration Distribution
డిజిటల్ వ్యాలెట్ తో రేషన్ సరుకులు
ప్రభుత్వం పేదలకు అందించే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల డిజిటల్ వ్యాలెట్లలో జమ చేస్తుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒక మొబైల్ ఆధారిత వ్యాలెట్ అందుబాటులో ఉంటుంది. రేషన్ షాపు వద్ద బయోమెట్రిక్ అవసరం లేకుండానే ఈ డిజిటల్ కరెన్సీతో సరుకులు తీసుకోవచ్చు. ప్రతి నెల తమకు ఎంత సబ్సిడీ అందుతుందో లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు. డీలర్లకు కూడా తమ మార్జిన్లు ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి.
Ration distribution: మధ్యాహ్న భోజనం, ఇతర కీలక నిర్ణయాలు
రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన స్టీమ్డ్ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం నుంచి 2 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మినీమార్టులు ఏర్పాటు చేసి తక్కువ ధరలకే సరుకులు అందించనున్నారు. అరకు కాఫీని దేశంలోని అన్ని మిలటరీ క్యాంటీన్లలో విక్రయించేందుకు ఎన్సీసీఎఫ్ సంస్థ అంగీకారం తెలిపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

