Dailyhunt
ఏప్రిల్ 2 నుండి తెలంగాణలో 'భూభారతి' సేవలు

ఏప్రిల్ 2 నుండి తెలంగాణలో 'భూభారతి' సేవలు

వార్త 3 weeks ago

Bhu Bharati Portal: తెలంగాణ రాష్ట్రంలోని భూ యజమానులు మరియు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూపొందించిన 'ఇంటిగ్రేటెడ్ భూభారతి' పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది.

ఏప్రిల్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని ఐదు ఎంపిక చేసిన మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also:CM Breakfast Scheme: తెలంగాణలో 'ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్' పథకం మెనూ ఇదే!

 Registration and Revenue Services in One Place

Bhu Bharati Portal: రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే మరియు స్టాంపుల విభాగాల సమన్వయం

ఈ నూతన పోర్టల్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకే వేదికపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే మరియు స్టాంపుల విభాగానికి సంబంధించిన అన్ని సేవలు పౌరులకు లభిస్తాయి. గతంలో ఉన్న ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించి, భూ లావాదేవీల్లో అత్యంత పారదర్శకతను తీసుకురావడమే ఈ ‘భూభారతి’ ప్రధాన ఉద్దేశం. భూముల క్రయవిక్రయాలు మరియు రికార్డుల సవరణ ప్రక్రియను ఇది మరింత సులభతరం చేయనుంది.

ఆ 5 మండలాల్లోనే మొదట!

తొలిదశలో భాగంగా ఐదు జిల్లాల నుండి ఐదు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్‌గల్, సంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, మరియు నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలాల్లో ఈ సేవలు మొదటగా ప్రారంభం కానున్నాయి. ఇక్కడ లభించే ఫలితాల ఆధారంగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ సమగ్ర భూ యాజమాన్య పోర్టల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha