Annamalai : తమిళనాడు రాజకీయాల్లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) ఫైర్బ్రాండ్ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కె.
అన్నామలై త్వరలోనే కాషాయ జెండాను వీడనున్నట్లు అత్యంత నమ్మకమైన వర్గాల సమాచారం. పార్టీ నుంచి గౌరవప్రదంగా నిష్క్రమించాలని (ఫేర్వెల్) భావిస్తున్న ఆయన, ఇందుకు సంబంధించిన తుది చర్చల కోసమే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు గత కొన్నేళ్లుగా తీవ్రంగా శ్రమించిన అన్నామలై, ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ మారడం లేదా రాజకీయాలకు దూరం కావడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ‘ఫేర్వెల్ మీటింగ్’ వార్త తమిళనాడు బీజేపీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Read Also : డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

విజయ్ను ఢీకొట్టే వ్యూహం
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీ (TVK) స్థాపించిన తర్వాత అక్కడి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ను రాజకీయంగా సవాలు చేసే సరైన ప్రత్యామ్నాయ నాయకుడు లేరని, ఈ తరుణంలో నేరుగా కాకుండా ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలని అన్నామలై యోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగానే ఆయన తొలుత ఎలాంటి పొలిటికల్ రంగు లేని ఒక ‘రాజకీయేతర ప్రజా ఉద్యమాన్ని’ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రజల్లో బలమైన పునాది ఏర్పడిన తర్వాతే తదుపరి అడుగు వేయాలని ఆయన భావిస్తున్నారు. కాగా, అన్నామలైకి కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవి దక్కబోతోందని, లేదా సూపర్ స్టార్ రజినీకాంత్తో కలిసి ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ముఖ్య అనుచరులు స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

